telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక పదవి..

Raghunandan

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు… ఆయన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కలు చూపించి మరీ.. దుబ్బాకలో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కేవలం 1000 పై చిలుకు ఓట్లతో గెలిచిన…ఆయన బీజేపీ పార్టీలో నూతన ఉత్సాహం నెలకోల్పారు. ఈ దుబ్బాక ఎన్నిక ఉత్సాహంతోనే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. దీనికి కారణం దుబ్బాక విజయమే అని చెప్పక తప్పదు. ఇది ఇలా ఉండగా…ఎమ్మెల్సే రఘునందన్‌రావుకు కీలక పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర జిమ్మాస్టిక్స్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఆదివారం ఫతేమైదాన్‌ క్లబ్‌లో తొలుత జిమ్నాస్టిక్స్‌ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి అనంతరం నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్‌ సహా నూతన కార్యవర్గం సభ్యులను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. కోశాధికారిగా వై. రవీందర్‌, ఉపాధ్యక్షులుగా ఎం.బాల్‌రాజ్‌, ఆనంద్‌ మిశ్రా కుల్దీప్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ ఎన్నికలకు శాట్స్‌ నుంచి పరిశీలకుడిగా రవీందర్‌ హాజరయ్యారు.

Related posts