telugu navyamedia
సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” హిలేరియ‌స్‌ ట్రైన్ జ‌ర్నీ… చెప్పేసిన దర్శకుడు

Sarileru-Nikevvaru

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ట్రైన్ డోర్ ద‌గ్గ‌ర మ‌హేష్ నిలుచున్న ఫోటోని షేర్ చేశాడు. “రెండో షెడ్యూల్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. హిలేరియ‌స్‌గా సాగే ట్రైన్ జ‌ర్నీ వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్‌లో రానుంది. మ‌హేష్ ఎంట‌ర్‌టైన్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూడండి” అంటూ పోస్ట్ చేశాడు అనిల్. ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్ లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ రశ్మిక పాల్గొననుందని సమాచారం. అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా మ‌హేష్‌ చేస్తున్న తరుణంలో ఆయన బోర్డర్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో హీరోయిన్ రశ్మికకు, మహేష్ కి మధ్య రొమాంటిక్ కామెడీ ని దర్శకుడు అనిల్ ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ప్లాన్ చేసాడేమో చూడాలి.

Related posts