“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటుంది. తాజాగా డైరెక్టర్ తేజకు సాయిపల్లవి `నో` చెప్పిందట. గోపీచంద్ కథానాయకుడిగా డైరెక్టర్ తేజ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి అయితే బాగుంటుందని తేజ భావించాడట. ఆమెను సంప్రదించాడట. అయితే ఆ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి నిరాకరించిందని సమాచారం. యంగ్ హీరోలతో నటిస్తున్న తను, మిడిల్ ఏజ్డ్ హీరోతో చేస్తే కెరీర్కు ఇబ్బంది ఎదురవుతుందని సాయిపల్లవి భావించిందట. దీంతో తేజ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.
previous post
next post
18 ఏళ్ళ వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని… ఎలా నిరూపించాలి ? : చిన్మయి