telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మద్యం మత్తులో కారు న‌డిపిన ఐఏఎస్‌.. బైక్‌ను ఢీకొట్ట‌డంతో జ‌ర్న‌లిస్టు మృతి

Accident

మద్యం మత్తులో ఓ ఐఏఎస్ అధికారి బీభత్సం సృష్టించాడు. కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి మితి మీరిన వేగంతో కారు నడుపుతూ…బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక “సిరాజ్‌” బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

వెంకటరామన్‌ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులకు ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. పోలీసులు సీసీటీవీ ఫూటేజ్‌ను ప‌రిశీలించారు. జ‌ర్న‌లిస్టు బైక్‌ను ఐఏఎస్ శ్రీరామే ఢీకొట్టిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Related posts