telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ పై కరోనా బుసలు : మరో దర్శకుడు మృతి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. అయితే తాజాగా వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్‌(38) కోవిడ్ తో మృతి చెందారు. రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వట్టి కుమార్‌ మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వట్టి కుమార్‌.. ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచాడు వట్టి కుమార్‌. వట్టి కుమార్ స్వస్థం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఇది ఇలా ఉండగా…‘మా అబ్బాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన వట్టికుమార్.. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా వట్టి కుమార్ మృతి పట్ల పలుగురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts