telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దిల్ బేచారా” హీరోయిన్ పై రియా సంచలన వ్యాఖ్యలు

Sushanth

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సుశాంత్‌ ఎప్పటి నుంచో డ్రిపెషన్‌లో ఉన్నాడని, అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రియా చక్రవర్తి.. “దిల్‌ బేచారా” హీరోయిన్‌ సంజనా సంఘీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై వచ్చిన మీటూ ఆరోపణలపై స్పష్టతనివ్వడంతో సంజన ఆలస్యం చేసిందని, ఈ పరిణామాలు అతడిని కుంగదీశాయని చెప్పుకొచ్చారు. “మీటూ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేశారు? ఈ విషయంపై విచారణ జరగాలి. నెలన్నరగా నేనెందుకు మౌనంగా ఉన్నానని ప్రశ్నించిన వాళ్లు ఈ విషయంపై దృష్టి సారించాలి” అంటూ రియా వ్యాఖ్యానించారు. ఇక రియా వ్యాఖ్యలపై సంజన సంఘి తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ “ఓ మహిళగా నేనేం ఏం చెప్పాలో అంతా చెప్పాను. జరిగిన దాని గురించి పూర్తిగా వివరించాను. మళ్లీ కొత్తగా ఇలా మాట్లాడితే అస్సలు సహించేది లేదు” అంటూ రియాపై ఫైర్ అయ్యారు. సహ నటిగా సుశాంత్‌ గురించి తాను కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాని, ఒకరి జీవితంలో తలదూర్చే ప్రయత్నం చేయనని చెప్పుకొచ్చారు. ‘దిల్‌ బేచారా’కు ముందు తానెన్నడూ సుశాంత్‌ను కలవలేదని, అయితే సెట్లో తనను గమనించిన దాన్నిబట్టి ఎంతో మంచి వ్యక్తి అని చెప్పగలనన్నారు. ఇక సుశాంత్‌ మృతి తన మనసును కలచివేసిందన్న సంజన.. అతడికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయకూడదని పరోక్షంగా రియాను ఉద్దేశించి చురకలు అంటించారు.

కాగా ‘దిల్‌ బేచారా’ సినిమాలో సుశాంత్‌, సంజన జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో (2018) సుశాంత్‌ ఆమెను లైంగికంగా వేధించాడంటూ వదంతులు వ్యాపించాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ సంజనతో తాను చేసిన చాట్‌ను బహిర్గతం చేసిన సుశాంత్‌, తనతో హుందాగా ప్రవర్తించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నెలరోజులకు ఈ విషయంపై స్పందించిన సంజన”యూఎస్‌ ట్రిప్‌ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది” అంటూ ట్వీట్‌ చేశారు.

Related posts