*సాలురు ఎమ్మెల్యే రాజన్న దొరకు అస్వస్థత..
*మన్యం జిల్లా ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ రగడ..
*కుర్చి వేయకుండా అవమానించారని అసహనం
*మనస్థాపంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే రాజన్న దొర
సాలూరు సీనియర్ శాసనసభ్యులు రాజన్నదొరకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రాజన్నదొర చికిత్స పొందుతున్నారు. మన్యం జిల్లా ప్రారంభోత్సవంలో కుర్చి వేయకుండా అవమానించారని అసహనం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవం జరుగుతున్న వి.సిలో మధ్యలో నుంచి తనంతటతానుగా ఎమ్మెల్యే రాజన్నదొర ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. శరీరం అలసట చెందటం వలన బి.పి డౌన్ అయిందని వైద్యులు చెబుతున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.


40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్