ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు.
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ క్వాంటం నెర్వ్ సెంటర్ గా మారుతుంది. ఇక్కడ ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ నుంచి క్వాంటం హార్డ్ వేర్ యాక్సెస్ ఉంటుంది.
పరిశోధనలు, ఆవిష్కరణల కోసం కొత్త ఆల్గారిథమ్స్, క్రిప్టో గ్రఫీ అవసరం అవుతుంది. దానికి అనుగుణంగా నిపుణులు అవసరం అవుతారు.
అందుకే అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 35 క్యూఐసీలతో పాటు భారత్ లో మొదటి క్యూఐసీ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది అని అమిత్ సింఘీ, ఐబీఎం ప్రతినిధి తెలిపారు

