telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిని తరలిస్తానంటే కుదరదు: జేసీ దివాకర్ రెడ్డి

jc-diwakar-reddy

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. రాజధానిని ముక్కలుగా చేసి తరలిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు. మనిషి శరీరానికి తల ఎంత ప్రధానమైనదో, రాష్ట్రానికి రాజధాని కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు.

కానీ సీఎం జగన్ తల నరికి ఇంకో చోట పెడతానని, మొండేన్ని మరో చోట పెడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్.. తెలివి నీ ఒక్కడి సొత్తు అనుకోవద్దు అందరికీ ఉంటుంది అని హితవు పలికారు.

అమరావతిలో రాజధాని అంటేనే చాలా దూరం అనుకున్నామని చెప్పారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా తరలిస్తున్నారు, సీఎం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని అనుకుంటున్నారు. రాజధానిని తరలిస్తే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Related posts