telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ప్రియురాలి తల్లిపై కాల్పులు జరిపి.. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

gun fire

ప్రియురాలి తల్లిపై కాల్పులు జరిపి అనంతరం రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల ఆ అమ్మాయి అడగగా బాలాజీ అందుకు నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు బాపట్ల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వారిపై పగ పెంచుకున్న బాలాజీ తాను ప్రేమించిన అమ్మాయి తల్లిపై కాల్పులు జరిపాడు. ఈ రోజు ఆ యువకుడు తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బాలాజీ మృతదేహాన్ని అతడి బంధువులు గుర్తించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోమని చెప్పినందుకే ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు.

Related posts