వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.
అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా క్వాంటం రంగంలో నిపుణుల్ని తయారు చేసేలా శిక్షణ ఇవ్వనున్న వైసర్ సంస్థ.
2035 నాటికి 35 లక్షల మంది విద్యార్ధులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ. క్వాంటం హార్డ్ వేర్, సిమ్యులేటర్లు, టూల్ కిట్స్ సహా 10 వేల నిముషాల క్వాంటం హెచ్ పీసీ కంప్యూటర్ క్రెడిట్స్ ను ఇచ్చేలా నిర్ణయం.
క్వాంటం రెడీ వర్క్ ఫోర్సును తయారు చేసే లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయనున్న వైసర్ సంస్థ. ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించే విజన్ ఆంధ్రప్రదేశ్ లో భారత్ లోనూ కనిపిస్తోంది.
భారతీయుడిగా దీని పట్ల నేను గర్విస్తున్నాను. అమరావతిలో వైజర్ క్వాంటం ట్యాలెంట్ హబ్ ను ఆవిష్కరిస్తున్నాం.
సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా దశలవారీగా 35 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేలా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం.
వైసర్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారి అమరావతిలో ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది అని వరదాన్ వైసర్ సంస్థ ప్రతినిధి తెలిపారు.

