telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ షాకింగ్ కామెంట్స్.. ఇవి చిల్లర ఎత్తుగడలు

Sajjala ycp

ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దురదృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు ఎస్ఈసీ.. ఎన్నికలు వాయిదా వేసిందని గుర్తు చేశారు. టీడీపీవి చిల్లర ఎత్తుగడలు అని.. ప్రజాస్వామ్య ప్రక్రియ ఆగితే టీడీపీకి సంతోషం వేస్తుందంటే చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందేనన్నారు. ప్రజలు పాల్గొన్న ఎన్నికలు రద్దు అయినందుకు సంతోషపడటం జుగుప్సాకరమని మండిపడ్డారు. టీడీపీకి ప్రజా జీవనంలో ఉండే అర్హత లేదు..ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు దారుణమైన, అన్యాయమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో రిస్క్ తో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించాల్సి పోయి… ఇంత తేలిగ్గా తీసుకుంటారా? అని ఫీ అయ్యారు. న్యాయం గెలిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

Related posts