telugu navyamedia
సినిమా వార్తలు

82 శాతం మార్కులతో ఇంటర్ పాసైన “సైరత్” హీరోయిన్

Rinku

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మరాఠి చిత్రం “సైరత్” తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టి దేశం మొత్తం మరాఠి చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ చిత్రంలో రింకు రాజ్ గురు హీరోయిన్ గా నటించింది. రింకు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. “సైరత్” చిత్రం 2016లో విడుదలయింది. ఆ చిత్రం విడుదలయ్యే సమయంలో రింకు 10వ తరగతి విద్యార్థిని మాత్రమే. ఇటీవలే రింకు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన మహారాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో రింకు 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దీనితో నటిగానే కాదు, విద్యార్థిగా కూడా రింకు అదరగొట్టేస్తోందని ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రింకు సినిమాల్లో నటిస్తూనే 82 శాతం మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా రింకు తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె సినిమాల్లో నటిస్తూనే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుందని తెలిపారు.

Related posts