telugu navyamedia
సినిమా వార్తలు

పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌… మరో మూడురోజుల్లో డిశ్చార్జ్‌

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబ‌ర్10న రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వినాయ‌క చ‌వితి రోజు రాత్రి ఎనిమిది గంట‌ల‌కు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్‌-ఐకియా మార్గంలో బైక్‌పై వేగంగా వెళుతున్న క్ర‌మంలోబైక్ స్కిడ్ అయి సాయి ధ‌ర‌మ్ గాయ‌ప‌డ్డాడు. వెంట‌నే ఆయ‌న‌ను మెడికవ‌ర్ ఆసుప‌త్రికి ప్రాథ‌మికి చికిత్స కోసం త‌ర‌లించారు. అనంతరం అపోలో హాస్పిట‌ల్‌కు షిఫ్ట్ చేశారు.

ప్ర‌త్యేక వైద్య బృందం సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తూ.. ఆయ‌న కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ కూడా చేశారు. దాదాపు ప‌ది రోజులు వెంటిలేట‌ర్‌పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది.

సాయిధ‌ర‌మ్‌ను ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి మార్చామ‌ని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్న‌ట్టుకూడా పేర్కొన్నారు. రెండు మూడురోజుల‌లో సాయిధ‌ర‌మ్ డిశ్చార్జ్ కానున్న‌ట్టు హాస్పిట‌ల్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. 

Related posts