telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కు యాక్సిడెంట్… కాపాడిన సాయి ధరమ్ తేజ్

Sai-Dharam-Tej

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన పనికి ఇప్పుడు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుధ‌వారం సాయంత్రం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణి జూబ్లీ హిల్స్‌ నుండి బైక్‌పై వెళుతున్నాడు. అయితే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 52లో కారును తప్పించబోయి టైర్‌ స్కిడ్‌ అయి కింద పడ్డాడు అచ్చూ. అదే సమయంలో నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని అటుగా వ‌స్తున్న తేజూ ప్ర‌మాదాన్ని గుర్తించి, అచ్చుని తన కారులో ఎక్కించుకొని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చూ కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ప్ర‌మాద‌మేమి లేద‌ని వైద్యులు చెప్ప‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ప్రతీరోజూ పండగే”. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Related posts