telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తండ్రి చివరిచూపు చూసుకొనేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం

rihsikapoor

ప్రముఖ నటుడు రిషీకపూర్‌ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్‌లో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిషీకపూర్‌ కూతురు రిద్దిమా కపూర్‌ తనకు ముంబై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆమె అధికారులకు దరఖాస్తు కూడా అందజేశారు. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మార్గంలో ఆమె ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారు. దీంతో రిద్దిమా రోడ్డు మార్గంలో 1400 కి.మీ ప్రయాణించి ముంబై చేరుకోనున్నారు. ఇందుకు దాదాపు 18 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. రిద్దిమా ముంబై చేరకున్నాకే.. రిషీకపూర్‌ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ప్యాషన్‌ డిజైనర్‌గా ఉన్న రిద్దిమా వ్యాపారవేత్త భరత్‌ సాహ్నిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.

Related posts