telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్, సీఎస్‌లను చర్లపల్లి జైల్లో పెట్టాలి: రేవంత్‌ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రాంతంలోని దేవాలయం, మసీదులకు కూడా ధ్వంసం కావడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ధనంతో మరింత విశాలంగా వీటిని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి పేరిట ప్రకటన విడుదలైంది. అయినప్పటికీ వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆలయం, మసీదులను కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

దీనికంతటికీ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కారణమని వారిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు.

దేవాలయం కూల్చివేతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సీఎస్ సోమేశ్ కుమార్ పెడచెవిన పెట్టారని రేవంత్ విమర్శించారు. కోర్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

Related posts