తెలంగాణ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే
మల్లు స్వరాజ్యం పార్థివదేహం నల్గొండకు చేరుకుంది. మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీగా వచ్చి సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర సాగనుంది. స్వరాజ్యం చివరి కోరిక మేరకు భౌతికకాయం వైద్య కళాశాలకు ఇవ్వనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.అమెకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డా- సీఎం కేసీఆర్