కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుక చౌదరి అధిష్టానానికి హెచ్చరిక చేశారు. తనకు ఖమ్మం టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదని, రాజీనామా తథ్యం అని స్పష్టం చేసేశారు. ఎన్నికల సందర్భంగా టిక్కెట్లకై ఆయా పార్టీలలో రగడ మొదలైంది. సీనియర్ నేతలతో సహా అందరూ ఇదే బాటలో నడుస్తుండటం విశేషం. పార్టీకి ఎంతో సేవచేసిన వారికి కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరికో టిక్కెట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
తాజాగా, ఖమ్మం పార్లమెంట్ సీటు టికెట్ తనకే కేటాయించాలంటు, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి హెచ్చరించారు. కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు రేణుకా చౌదరి. దీంతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో హీటు పుట్టింది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేథప్యంలో తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమైన రేణుకా చౌదరి.. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తోంది.