telugu navyamedia
రాజకీయ వార్తలు విద్యా వార్తలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న … దళారులను నమ్మవద్దు…

ap logo

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి.

Related posts