telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి పట్ల కేసీఆర్‌ దిగ్బ్రాంతి

Kaveti Sammaiah sirpur

తెలంగాణ ఉద్యమకారుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటీ సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపుతూ ఈ విషాద సమయంలో గుండెనిబ్బరంతో ఉండాలన్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

సమ్మయ్య స్వస్థలం కుమురంభీమ్ జిల్లా సిర్పూర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నసమ్మయ్య ఈ రోజు ఉదయం స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమనాయకుడైన కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్సీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమిపాలయ్యారు.

Related posts