telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నన్ను తిట్టిన బీజేపీ నాయకులకు కూడా ఇండ్లు ఇచ్చాం : హరీష్‌రావు

Harish Rao TRS

సిద్దిపేటలో 168 మంది డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు ఇవాళ ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో నన్ను తిట్టిన బీజేపీ నాయకుడికి కూడా ఇల్లు వచ్చిందని, అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేశామని పేర్కొన్నారు. ఈ ఇండ్లు అమ్మినా కొన్న కేసులు నమోదు చేస్తామని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు అనేది పేదవారి కల, సొంత ఇల్లు అనేది ఒక ఆశయమన్నారు. పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారని… మనిషికి అతి ముఖ్యమైనవి పెండ్లి, ఇల్లు అని… ఈ రెండు కార్యాలయాలకు ప్రభుత్వము సహాయం అందిస్తుందని గుర్తు చేశారు. పేదవారి బరువును మా అధికారులు మోశారని.. నేటితో మాకు ఈ ఇండ్లతో విడాకులు, మీకు పెండ్లి అవుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాడని కొనియాడారు. ప్రజల ఆశీస్సులతో ఇంకా చాలా సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువస్తుందని స్పష్టం చేశారు.

Related posts