telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళు నాకోసం మట్టి పాత్రల్లో అన్నం, పప్పు చేశారు… : రేణూదేశాయ్

Renu

హీరోయిన్, క్యాస్టూమ్ డిజైనర్, డైరెక్టర్, రచయిత్రి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకుంటారు. కొంతకాలం సినిమాలకు దూరమైన రేణూ దేశాయ్ మళ్లీ వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట కోసం తాజాగా ప్రముఖ రచయిత గోరేటి వెంకన్నను కలిశారు. ఆ అనుభవాన్ని రేణు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆ ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. “ఎంతో ఆత్మీయత, ప్రేమ.. పాటల కోసం గోరేటి వెంకన్నగారి ఫామ్‌కు వెళ్లాను. నా సినిమాకు ఆయన పాట రాయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆయన భార్య నాకోసం మట్టి పాత్రల్లో ఎంతో రుచికరంగా అన్నం, పప్పు చేశారు. రోటీ పచ్చడి చేశారు. అరటి ఆకులో భోజనం పెట్టారు. ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారితో ఆదివారం మధ్యాహ్నం మంచి అనుభూతి పొందాను” అని రేణు తెలిపారు.

Related posts