మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు నటుడు శివబాలాజీ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా” అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు. మౌంట్ లిటేరా జీ స్కూల్ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.