టీడీపీ 31న విశాఖపట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు తరలిరానున్నారు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి విశాఖ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పోటీలో నిలవగా; వైసీపీ నుంచి సత్యనారాయణ; జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ; బీజేపీ నుంచి పురందేశ్వరి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారనుంది.
భారీగా పోటీ ఉన్న ఇక్కడ విజయం సాధించడం అన్ని పార్టీలు ప్రధానంగా భావిస్తున్నాయి. ఈ లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 31న నగరంలో నిర్వహించనున్న సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు జాతీయ నాయకులను టీడీపీ ఆహ్వానించినట్టు సమాచారం.
కవిత ఓడిపోవడానికి ఫ్యాక్టరీ వివాదమే కారణం: జీవన్ రెడ్డి