telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైవా హర్ష భార్య గతం మరిచిపోయిందంట… అసలేం జరిగిందంటే ?

AJ

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పీరియడ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. దీంతో ఇప్పుడు జనాలు ఎంటెర్టైన్మెంట్ కోసం డిజిటల్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌ల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం మంచి కామెడీతో కూడిన వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ అధినేత‌, ప్రముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’. చందూ అల్లాడ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ కామెడీ వెబ్ సిరీస్‌లో వైవా హ‌ర్ష, య‌ష్న చౌద‌రి న‌టించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. లాక్‌డౌన్ సమయంలో చందు తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. సిద్ధార్థ్ (వైవా హర్ష), గీత (యష్న చౌదరి) ప్రేమ వివాహం చేసుకుంటారు. వీరి వివాహానికి పెద్దలకు అంగీకరించరు. దీంతో ఇంట్లో నుంచి వచ్చి పెళ్లి చేసుకుంటారు. నిజానికి గీతకు సిద్ధార్థే మొదట ప్రపోజ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆమెకు బానిస అయిపోతాడు. ఉదయం కాఫీ అందించడం దగ్గర నుంచి అన్ని పనులూ సిద్ధార్థే చేయాలి. భర్తను టార్చర్ పెడుతుంది గీత. అయితే, ఒకరోజు వీరికి యాక్సిడెంట్ అవుతుంది. గీత తలకు గాయం కావడంతో గతం మరిచిపోతుంది. అయితే, సిద్ధార్థ్ ఆమె భర్త అని గీతకు డాక్టర్ చెప్పడంతో అతడితో ఇంటికి వెళ్తుంది. ఆ తరవాత భార్యకు సిద్ధార్థ్ గతాన్ని ఎలా గుర్తు చేశాడు అనేది ఆసక్తికరం.

Related posts