telugu navyamedia
వార్తలు సామాజిక

ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం: ఎయిమ్స్ డైరెక్టర్

Randeep Guleria AIIMS

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో పీక్ స్టేజ్ దశ కూడా ముగిసి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ముంబయి, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ, దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లోనూ పీక్ స్టేజ్ ఇప్పటికే పూర్తయి, అక్కడ కేసుల గ్రాఫ్ క్రమంగా కిందికి దిగుతోందని పేర్కొన్నారు.

దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో పీక్ స్టేజ్ కి చేరుతుందని వివరించారు. కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసంవ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని అన్నారు. 

Related posts