వివాద స్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పడూ ఎదో ఒక వార్తలో నిలుస్తాడు..వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఎప్పుడు దేని గురించి స్పందించినా, అది ఒక సెన్సేషన్ అవ్వక తప్పదు. ఎలాంటి ప్రశ్న అడిగినా ఆయన దగ్గర జవాబు ఉంటుంది. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఒంటరిగా పోరాడిన వర్మ.. నిర్ణయాన్ని ఇక ప్రభుత్వానికే వదిలేశారు.
తాజాగా టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోపై ఆర్జీవీ మనసుపారేసుకున్నాడు.
ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన షోకు ఆహ్వానించిన బాలయ్య.. వారితో చేసిన హడావుడి మామూలుగా లేదు.. అదే.. ఆహాకు మంచి వ్యూస్ కూడా తెచ్చి పెడుతోంది.
తాజాగా అన్స్టాపబుల్ ఎన్బీకే ప్రోగ్రామ్పై ఆర్జీవి ఆసక్తకిర కామెంట్స్ చేశారు..“నాకు ఆహాలో వచ్చే అన్స్టాపబుల్ విపరీతంగా నచ్చింది. నాకు ఆ షోకు వెళ్లాలని ఉంది. బాలయ్య గారు నాకు ఆ అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను ” అంటూ ట్వీట్ చేశారు . దీంతో వర్మ చేసిన ట్వీట్ వైరల్గా మారుతుంది.
ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అవసరమా ?