ప్రస్తుతం కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. అందులో భాగంగానే సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇందులో సినిమా సహా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మరో ముగ్గురికి సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ను విసురుతున్నారు. రీసెంట్గా ఈ ఛాలెంజ్లో సూపర్ స్టార్ మహేశ్ శ్రీమతి నమత్ర శిరోద్కర్ పాల్గొన్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘ప్రస్తుతం మనమందరం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.. మేం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. Stay Home. Stay Safe. Stay Healthy’ అంటూ సందేశమిచ్చారు.
Stay Home. Stay Safe. Stay Healthy. 🙏🏻 pic.twitter.com/UNMi2xQbbz
— Anushka Sharma (@AnushkaSharma) March 20, 2020