telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోహీరోయిన్లు… “థ్రిల్లర్” పోస్టర్స్ తో వర్మ రచ్చ

Thriller

రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ మూవీ ‘థ్రిల్లర్’ కోసం డిఫరెంట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో వరుసపెట్టి అడల్ట్ సినిమాలు చేస్తున్న ఆయన.. లేటెస్ట్ మూవీ ‘థ్రిల్లర్’లో అంతకుమించిన మసాలా ఉంటుందని తాజా పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఇప్పటికే థ్రిల్లర్ బ్యూటీ అప్సరా రాణి సెక్సీ ఫొటోలతో మత్తెక్కించిన వర్మ.. ఈ రోజు ఉదయం నుంచి వరుసపెట్టి అడల్ట్స్ ఓన్లీ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. అన్ని పోస్టర్లలో కూడా హీరోహీరోయిన్లను నగ్నంగా ఒంటిపై నూలు పోగు లేకుండా చూపించడంతో ఒక్కసారిగా ‘థ్రిల్లర్’ మూవీపై జనం దృష్టి పడింది. ఎక్కడ చూసినా ఈ పోస్టర్స్ గురించిన చర్చే మొదలైంది. రామ్ గోపాల్ వర్మ టార్గెట్ కూడా అదే కాబట్టి ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా మరిన్ని పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరోహీరోయిన్స్ అప్సరా రాణి, రాక్‌లు ఇద్దరూ ఒడిశాకు చెందిన వారే అని, మరికొద్ది రోజుల్లో ఒడిశా టాలెంట్ చూడబోతున్నారంటూ న్యూడ్ పోస్టర్లతో సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చేశారు వర్మ. ఇటీవలే తెలుగమ్మాయి శ్రీ రాపాకతో హాట్ మూవీ ‘నగ్నం’ అనే మూవీతో అగ్గి రాజేశారు. ఇక ఇప్పుడు ఒడిశా బ్యూటీ అప్సరా రాణి అందాలతో థ్రిల్ చేయాలని ‘థ్రిల్లర్’ మూవీ చేస్తున్నారు.

Related posts