telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ అస్తికలు గంగానదిలో కలిపిన కుటుంబ సభ్యులు… కంటతడి పెట్టిస్తోన్న ఆయన సోదరి పోస్ట్

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబై బాంద్రాలోని అతని నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ముంబైలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులు కొంత మంది సన్నిహితులు మాత్రమే ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఓవైపు వర్షం పడుతుండగానే సుశాంత్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇవాళ తండ్రి సోదరితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు గంగానది వద్ద చేరుకొని సుశాంత్ అస్తికలు పవిత్రా గంగానదిలో నిమజ్జనం చేశారు. ప్రస్తుతం పాట్నాలో తన ఫ్యామిలీతో ఉన్న సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “సారీ మేరా సోనా.. నువ్వు ఎంతో బాధలో ఉన్నావని, పోరాట యోధుడిలా పోరాడుతున్నావని నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన బాధలకి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకే ఛాన్స్ ఉండి ఉంటే బాధలని నేను తీసుకొని ఆనందాన్ని నీకు ఇస్తాను. నీ కళ్ళు, నిష్కలమైన నీ నవ్వు ప్రపంచానికి ఎంతో నేర్పింది. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. సంతోషంగా ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు నిన్ను ఇష్టపడతారు” అంటూ సుశాంత్ సోదరి చేసిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు సుశాంత్ మృతికి ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ ప్రముఖులే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్, సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై కూడా సుశాంత్ సోదరి స్పందిచారు. “ఇది క్లిష్టమైన సమయం అని నాకు తెలుసు. ద్వేషం కన్నా ప్రేమని ఎంపిక చేసుకోండి. స్వార్థం కంటే నిస్వార్థతను ఎన్నుకోండి… ఇతరులను క్షమించండి . ప్రతి ఒక్కరినీ ప్రేమించండి. ద్వేషానికి బదులు ప్రేమ, ఆప్యాయత పంచండి. ఎందుకుంటే ప్రతి ఒక్కరూ తమ సమస్యలతో పోరాడుతున్నారు. మీ హృదయాన్ని ప్రేమతో నింపండి” అని సుశాంత్ సోదరి తన పోస్ట్‌లో పేర్కొంది. బాలీవుడ్‌లో కెరీర్ మంచి సాగుతున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం చెందడం అందర్ని షాక్‌కు గురి చేసింది.

Related posts