telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి”పై వర్మ కామెంట్స్

RGV

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన “మహర్షి” చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కామెంట్ చేశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన సందర్భంగా వర్మ మాట్లాడుతూ తనకు రైతుల కష్టాల గురించి తెలియదని, తాను ఎప్పుడూ పొలానికి వెళ్లలేదని చెప్పారు. రైతుల గురించి మెసేజ్ ఇచ్చిన “మహర్షి” సినిమా గురించి వర్మను ప్రశ్నించగా మహేష్‌బాబు లేకుండా సినిమా తీసుంటే ఎవరూ చూసేవారు కాదని, రైతుల గురించి ఎన్నో సినిమాలు వస్తున్నా.. ఈ సినిమాను జనాలు ఆదరించడానికి కారణం మహేష్‌బాబేనని వర్మ అభిప్రాయపడ్డారు. ఇక “లక్ష్మీస్‌ ఎన్టీఆర్” గురించి మాట్లాడుతూ నిజాలు బయటపడతాయనే సినిమా విడుదల కాకుండా ఆపేశారని, సైకిల్ టైర్ పంచర్ అయిందని, అందుకే కారులో ఇక్కడికి వచ్చామని వర్మ సెటైర్ వేశారు. తాను రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తనకు లేదని వర్మ స్పష్టం చేశారు. అంతేకాదు మరో కొత్త సినిమాను కూడా తీయబోతున్నట్టుగా ప్రకటించారు వర్మ.

Related posts