ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.