telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఓటు హక్కును వినియోగించుకున్న జగన్

jagan attending guntur iftar tomorrow

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Related posts