telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై చంద్రబాబు ఫైర్

chandrababu tdp ap

పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలవరం నియోజకవర్గంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన పై టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా చంద్రబాబు స్పందిస్తూ… ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలుగు ప్రజలకు మన దేశంలోనే కాకుండా, ప్రపంచ నలుమూలలా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయించడంపై మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆయన ఆనవాళ్లను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని అన్నారు.

Related posts