telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : రాయల్స్ ఖాతాలో విజయం…

ముంబై వేదికగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్ బట్లర్ ను 5 పరుగులకే పెవిలియన్ చేర్చి షాక్ ఇచ్చాడు కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రాయల్స్ యువ ఆటగాళ్లు రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ 42 తో రాణించగా డేవిడ్ మిల్లర్24 అతనికి తోడుగా నిలిచాడు. వీరిద్దరూ చివరి వరకు ఔట్ కాకుండా ఉండటంతో 18.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి విజయం సాధించింది రాజస్థాన్. అయితే ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న రాయల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా ఓటమి కారణంగా కేకేఆర్ చివరి స్థానానికి పడిపోయింది.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్ ను బాగా కట్టడి చేసారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. కానీ రాహుల్ త్రిపాఠి(36), దినేష్ కార్తీక్ (25) తో రాణించడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

Related posts