దేశ రాజధాని ఢిల్లీలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. అయితే, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆక్సిజన్ అందించి ఢిల్లీని ఆదుకోండి అంటూ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయనున్నట్టు తెలిపారు కేజ్రీవాల్.. ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహాయం చేస్తున్నప్పటికీ.. పెరుగుతోన్న కరోనా తీవ్రతతో.. అందుబాటులో ఉన్న అన్ని వనరులు సరిపోవు అని తమకు అర్థమవుతోందన్నారు ఢిల్లీ సీఎం. అయితే ఢిల్లీ సర్కార్ అడిగిన కోటా కంటే ఎక్కువ ఆక్సిజన్ కేటాయించినట్టు చెబుతోంది కేంద్రం.. ఆక్సిజన్ అందించిన కేంద్రానికి నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీకి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కృతజ్ఞతలు కూడా తెలిపారని.. ఇప్పుడు ఉన్న కోటాను సరైన విధంగా వినియోగించుకోవడానికి ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.
previous post
next post