ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్కు వర్షం తీవ్ర అడ్డంకిగా మారుతోంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆగిపోయింది. ఇప్పటికి రద్దైన మ్యాచ్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే వర్షం కారణంగా ఇన్ని మ్యాచ్లు రద్దవడం ఇదే తొలిసారి. ప్రతి మ్యాచ్కు ఇలా వర్షం అడ్డంకి కావడంపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
ఈ స్థితిపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ఫన్నీగా స్పందించారు. ‘మాకు వర్షాల అవసరం చాలా ఉంది. వరల్డ్ కప్ 2019ను ఇండియాకు షిఫ్ట్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ దానికి కూడా వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చల్లగా చెప్పింది. దీనితో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ మ్యాచ్ అంటే రెండు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిని చూపిస్తుంది. అలాంటిది ఆ మ్యాచ్ జరగదేమో అన్న ఆందోళన క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతోంది.
వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా?… కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్