మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు.. ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. కాగా… హైదరాబాద్లో నిన్న పలు చోట్ల వర్షం కురిసింది. రోడ్లపై వరద పారింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాలు పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్యలేదని.. భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటున్నారు.
previous post
సుడిగాలి సుధీర్ బేవకూఫ్… : నాగబాబు