telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ తీసుకున్నన్ని అప్పులు మరే రాష్ట్రం తీసుకోలేదు: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

ఆంధ్రప్రదేశ్ తీసుకున్నన్ని అప్పులు మన దేశంలో మరే రాష్ట్రం తీసుకోలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ పరిణామాలు ఎంతో ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అప్పులు తీసుకుంటోందని తెలిపారు. అయితే అభివృద్ధిలో ఆ రాష్ట్రం పురోగతి సాధిస్తోందని అన్నారు.

మన రాష్ట్రానికి అప్పులు మాత్రమే పెరుగుతున్నాయని, అభివృద్ది మాత్రం లేదని విమర్శించారు.భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిని రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీతో స్నేహంగా మెలుగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ ధార్మిక సంస్థల నుంచి వచ్చే డబ్బుతో నడిచే ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ గా నియమించవద్దని విజ్ఞప్తి చేశారు. 

Related posts