telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టొద్దు.. జగన్ పై పురందేశ్వరి ఫైర్!

daggubatipurandeswari

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ జగన్ మాత్రం ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయేలా అడుగులు వేయొద్దని హితవు పలికారు.

పీపీఏల రద్దు సరికాదని, ఈ విషయంలో మరోమారు సమీక్షించుకోవాలని జగన్‌కు సూచించారు. ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేకపోవడం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 90 శాతం స్టోన్ క్రషర్లు మూతపడ్డాయని అన్నారు. ఫలితంగా పనులు లేక కూలీలు కడుపు కాల్చుకునే పరిస్థితి తలెత్తిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts