తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ లతో కలిసి హెలికాప్టర్ లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా వెళ్లిబాధితులను పరామర్శించారు.
ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. గడచినఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నిన్న సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు నా నా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.