దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్, మినీ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి.. ఈ తరహాలో చర్యల్లో ఇప్పుడు పంజాబ్ కూడా చేరిపోయింది.. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది పంజాబ్ సర్కార్.. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ కొనసాగనుండగా.. ఇక, ప్రతీరోజూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.. తదుపరి ఆదేశాల వెలువడే వరకు ఇది అమలులో ఉంటుందని.. ప్రజలంతా సహకరించాలని.. ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. అయితే చూడాలి మరి ఈ లిస్ట్ లో ఇంకా ఏఏ రాష్ట్రాలు చేరుతాయి అనేది.
కోడెలపై ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదు: ఉమ్మారెడ్డి