telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అన్నీ అనుకూలిస్తే మేలోనే పది పరీక్షలు: సీఎం కేసీఆర్

exam hall

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలిస్తే ఆగిపోయిన టెన్త్‌ పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలమేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

పరీక్ష హాలులో భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న 2,500 సెంటర్లను అవసరమైతే 5 వేలకు కూడా పెంచుతామని వివరించారు. పదో తరగతికి మిగిలిన 8 పరీక్షల పేపర్లను ప్రతి హాల్లో 10 నుండి 15 మంది ఉండే తీరుగా భౌతిక దూరం పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటామని వెల్లడించారు. విద్యార్థుల రవాణా కోసం ఆర్టీసీ బస్సులను సైతం నడుపుతామని చెప్పారు.

Related posts