లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. విపక్షాల మన్ననలను కూడా పొందిన గొప్ప నాయకుడైన బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడని చెప్పారు.
కోనసీమ అభివృద్ధి కోసం బాలయోగి చేసిన కృషి చాలా గొప్పదని అభివర్ణించారు. ఆయన చేసిన అభివృద్ది ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందామని అన్నారు.