గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ గతేడాది పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇప్పటికి వారి పెళ్లి జరిగి దాదాపు 120 రోజులు అవుతోంది. ఈ సెలబ్రిటీ దంపతులు ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉంటూనే మరోవైపు తీరిక సమయాల్లో ట్రిప్పులేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ జంట మియామీలో సేద తీరుతోంది. వారికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించి సంచలనం సృష్టించింది. ప్రియాంక లైఫ్ స్టైల్, ఆమె పద్ధతులు నిక్ కుటుంబానికి నచ్చట్లేదని, అందుకే నిక్ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ పత్రిక కథనం సృష్టించింది. దీంతో ఈ వార్తను చదివిన వారు అప్పుడే విడాకులా !! అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఏ విషయంపై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు. కానీ ఆమె సోదరి పరిణీతి చోప్రా మాత్రం ఈ వార్తను ప్రచురించిన మ్యాగజైన్ పై ఫైర్ అయ్యారు. “జనాల్ని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి మా కుటుంబమే దొరికిందా? వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం జోనాస్ బ్రదర్స్తో మియామీలో పార్టీలు చేసుకుంటూ హాలీడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్మీడియాలో ఉన్నాయి. ఏమీ లేకుండా ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు?” అంటూ పరిణితి మండిపడ్డారు. మరో పక్క ప్రియాంక, నిక్ తాము విడాకులు తీసుకోబోతున్నారంటూ రాసిన పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.