భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందుతోన్న విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది.
ప్రణబ్ కు ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు మెరుగుపడడం కోసం వైద్యం అందుతోందని చెప్పింది. ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్పై ఉంచే చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది.
కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ