పవర్ స్టార్ పవన్కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ‘భవదీయుడు భగత్సింగ్. గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని డిసైడ్ అయింది మైత్రీ మూవీ మేకర్స్. అందుకే ప్రస్తుతం లక్కీ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారు. తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.
ఇప్పటికే హరీశ్ ఆమెతో చర్చలు కూడా జరిపారని, ఆల్మోస్ట్ పూజా కన్ఫర్మ్ అయినట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో డీజే, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని చేసింది. డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదకెళ్లనుంది.
‘ఆచార్యా’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్న పూజా తమిళంలో ‘బీస్ట్’ తెలుగులో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాలకు ఆఫర్లు దక్కించుకుంది. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న సినిమాలే.