తెలుగు రాష్ర్టాల్లో ఓ ఊపు ఊపేస్తున్న ‘బుల్లెట్ బండి’ సాంగ్.. ఎక్కడ విన్నా ఇదే పాట మారు మ్రోగుతుంది. పెళ్లి వేడుకల్లో. బర్త్డే పార్టీలలో , స్కూల్లో, ఆస్పత్రుల్లో ‘బుల్లెట్ బండి’ సాంగ్కు క్రేజ్ మాములుగా లేదు..చిన్నా, పెద్దా అందరూ ఈ పాటకు స్టెప్పులేసేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన బుల్లెడ్ బండి పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్ 7న యూట్యూబ్లో అప్లోడ్ అయింది మొదలు దూసుకుపోతోనే ఉంది. ‘ డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.
ఎంతో పాపులరైన హుషారెత్తించే ఈ పాటకు తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణీ డాన్స్ చేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు సరదాగా డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా..ఇటీవల మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు సాయిశ్రీయ అప్పగింతల సమయంలో చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. యూట్యూబ్లో ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు…
సాధ్వీ ప్రజ్ఞ్జా సింగ్ వ్యాఖ్యల పై మోదీ ఫైర్