మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రేక్షకులకి పసందైన విందు అందించడం ఖాయమని అంటున్నారు. “చిత్రలహరి” విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం విశేషం. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర ప్రీ లుక్ విడుదల చేశారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు చేతిలో చేయి కలిపినట్టుగా ఉంది. “వేలు విడవని బంధం” అనే క్యాప్షన్తో పోస్టర్ ఉండగా, రేపు రాత్రి 8గం.లకి చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
previous post
నా రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరు..? : తాప్సి ఫైర్