ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అనౌన్స్ చేసారు. అయితే చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలని ఏ విధంగా తెరకెక్కించారో చూపించారు. అంతే కాదు హాలీవుడ్కి సంబంధించిన పలువురు యాక్షన్ పార్ట్కి సంబంధించి ఎలా ప్లాన్ చేశారో కూడా వివరించారు. ఈ వీడియో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాహో చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేసిన విషయం తెలిసిందే. మీరు కూడా “సాహో” మేకింగ్ వీడియోను వీక్షించండి.
previous post
next post
మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్